చర్లపల్లి, డిసెంబర్ 17 : పద్మశాలీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్సీ ఎల్.రమణ అన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్ పరిధిలోని పద్మశాలి టౌన్షిప్లో భావనరుషీ సహకార గృహనిర్మాణ సంఘం అధ్యక్షుడు సీత ఆంజనేయులు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో స్వర్గీయ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ, సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు బత్తుల సూర్యనారాయణ రావు విగ్రహాలను వరంగల్ మేయర్ గుండు సుధారాణి, మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్లతో కలిసి ఆయన అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, పద్మశాలీలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలని, ముఖ్యంగా రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుండు ప్రభాకర్, కాలనీ సంక్షేమ సంఘం నాయకులు సుధేశ్, సామాల లక్ష్మయ్య, అవ్వారు రామకృష్ణ, పున్న రమేశ్, సుదర్శన్, నాగభూషణం, రామలింగం, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.