KTR : ప్రముఖ నేపథ్య గాయని ఎస్.జానకి(S Janaki) మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విచారం వ్యక్తం చేశారు. తన మధురమైన గాత్రంతో నవరసాలు పండించగలిగే దిగ్గజ గాయని కన్నుమూసిందనే వార్త తెలిసి ఎంతో బాధపడ్డానని ఎక్స్ పోస్ట్లో సంతాపం తెలిపారు కేటీఆర్. సుమారు ఆరు దశాబ్దాల పాటు, వివిధ భారతీయ భాషల్లో కొన్ని వేల పాటలు పాడి భారతీయులను అలరించారు జానకి. ఈ పోస్ట్లో జానకి బాల్యం సిరిసిల్లలో గడిచిన రోజులను గుర్తు చేసుకున్నారు.
‘మిమిక్రీ కళను జోడించి ఆహూతులను అలరిచిన వైవిధ్యమైన గాయని జానకి తన బాల్యంలో కొన్నేళ్లు నేను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో నివాసం ఉన్నారు. జానకి మరణం సంగీత ప్రపంచానికి, భారతదేశ చలనచిత్ర రంగానికి తీరని లోటు. వారు భౌతికంగా మనకు దూరమైనా, వారి పాటలు సదా మనల్ని అలరిస్తూనే ఉంటాయి. జానకి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని కేటీఆర్ ఎక్స్ పోస్ట్లో వెల్లడించారు.
ప్రముఖ గాయని ఎస్ జానకి గారి మరణవార్త ఎంతో బాధాకరం!
తన మధురమైన గాత్రంతో నవరసాలు పండించగలిగే దిగ్గజ గాయని ఎస్ జానకి గారు. సుమారు ఆరు దశాబ్దాల పాటు, వివిధ భారతీయ భాషల్లో కొన్ని వేల పాటలు పాడి భారతీయులను అలరించారు.
జానకి గారు తన బాల్యంలో కొన్నేళ్లు నేను ప్రాతినిధ్యం వహిస్తున్న… pic.twitter.com/ecCMZLurRG
— KTR (@KTRBRS) July 11, 2026