మాదాపూర్, నవంబర్ 17: ప్రపంచవ్యాప్తంగా అనేక మంది చిన్నారులు నెలలు నిండకముందే పుట్టి అనారోగ్యంతో మరణిస్తున్నారని సినీ హీరో శర్వానంద్ ఆవేదన వ్యక్తం చేశారు. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో బుధవారం అంతర్జాతీయ ప్రీ మెచ్యురిటీ డేను పురస్కరించుకొని కిమ్స్ కడల్స్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు ముఖ్య అతిథిగా హాజరైన నటుడు శర్వానంద్ కిమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి. భాస్కర్రావు, సీఈవో డాక్టర్ అభినయ్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం శర్వానంద్ మాట్లాడుతూ … కిమ్స్ కడల్స్ చేస్తున్న సేవలు మరువలేనివన్నారు.
కిమ్స్ నియోనాటాలజీ విభాగం క్లినికల్ డైరెక్టర్, పిడియాట్రిక్ విభాగం సీనియర్ కన్సల్టెంట్, డాక్టర్ అపర్ణ మాట్లాడుతూ … కిమ్స్ కడల్స్లో చికిత్స పొందిన చిన్నారుల కుటుంబాలతో కలిసి సంబురాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం హీరో శర్వానంద్ చేతుల మీదుగా అవార్డులను అందజేశారు.కార్యక్రమంలో కిమ్స్ వైద్య సిబ్బంది డాక్టర్ సుధీర్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ భానుదీప్, డాక్టర్ శ్రీరాం, డాక్టర్ అరవింద, నియోనాటలజీ విభాగం, డెవలప్మెంట్ పిడియాట్రిషియన్ డాక్టర్ జి. శ్వేతలతో పాటు కిమ్స్ కడల్స్లో చికిత్స పొందిన చిన్నారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.