లాహోర్: సిక్కు ఉగ్రవాద సంస్థ ఖలిస్థాన్ కమాండో ఫోర్స్ (కేసీఎఫ్) చీఫ్ పరంజిత్ సింగ్ పంజ్వర్ను శనివారం కాల్చి చంపారు. పాకిస్థాన్లోని లాహోర్లో మార్నింగ్ వాక్ చేస్తున్న పరంజిత్ సింగ్ పంజ్వర్ అలియాస్ మాలిక్ సర్దార్ సింగ్పై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరపడంతో హతమయ్యాడు. భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు జాబితాలో పంజ్వర్(63) ఒకరు. పరంజిత్ సింగ్ అక్రమ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేయడమే కాక, పాకిస్థాన్లో యువతకు శిక్షణ ఇచ్చి వారిని భారత్లో ఉగ్రవాద కార్యకలాపాల నిర్వహణకు, వీఐపీలను హత్య చేయడానికి, ఆస్తులను ధ్వంసం చేయడానికి అక్రమంగా దేశాన్ని దాటించి పంపేవాడు. రేడియో పాకిస్థాన్ ద్వారా వేర్పాటువాద కార్యక్రమాలతో యువతను రెచ్చగొట్టి భారత్పై ద్వేషాన్ని నూరిపోసేవాడు.