యష్ కథానాయకుడిగా ప్రశాంత్నీల్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ ‘కేజీఎఫ్-2’ గురువారం ప్రేక్షకులముందుకొచ్చింది. ఈ సినిమాకు అంతటా పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తున్నది. దేశవ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ లభించాయి. అయితే ఈ సినిమాను కేవలం రెండు భాగాలతో ముగించడం లేదని తెలుస్తున్నది. మూడో పార్ట్ కూడా ఉందంటూ సినిమాలో ఓ హింట్ ఇచ్చారు. ఈ సర్ప్రైజ్ను చూసి యష్ అభిమానులు సంబరపడిపోతున్నారు. ‘కేజీఎఫ్-2’ క్లెమాక్స్ సన్నివేశాల్లో మూడో భాగం గురించి సంకేతాలిచ్చారు. హీరో రాఖీభాయ్ తన సామ్రాజ్యాన్ని అమెరికాలోనూ విస్తరించాడని..దానికి సంబంధించిన సమాచారం ఉందంటూ ఓ ఫైల్ను ప్రధానమంత్రికి అందిస్తారు. ఆ ఫైల్ను ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు ఏ పేజీలో ‘కేజీఎఫ్-3’ అని కనిపిస్తుంది. దీంతో రాఖీభాయ్ ప్రయాణం ఇంకా ముగిసిపోలేదని..అంతర్జాతీయ డాన్గా అతని ప్రస్థానాన్ని మూడోభాగంలో చూపించబోతున్నారని అభిమానులు అనుకుంటున్నారు. మూడోభాగం గురించి చిత్ర దర్శకనిర్మాతలు త్వరలో అధికారిక ప్రకటన చేస్తారని సమాచారం. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.