KCR : బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్హౌస్పై దాడికి కాంగ్రెస్ నేతలు గుంపులుగా వెళ్తున్నారు. తాము కేసీఆర్ చావును కోరుకుంటున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తల పొగురు వ్యాఖ్యలు చేశారు. ఇంకా కేసీఆర్ గురించి అనుచితంగా మాట్లాడారు. ఈ పరిస్థితులను బట్టి చూస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద హత్యాయత్నానికి ప్లాన్ చేసినట్లుగా అనిపిస్తోంది.
ఫామ్ హౌస్పై దాడికి బయలుదేరిన వారిలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా ఉన్నారు. ఒకవైపు కేసీఆర్ ఫాంహౌస్ చుట్టూ 144 సెక్షన్ విధించామని, ఎవరూ పరిసరాల్లోకి రావద్దని చెబుతున్న పోలీసులే.. మరోవైపు దగ్గరుండి కాంగ్రెస్ మూకలను ఫామ్హౌస్ వైపు సాగనంపుతుండటం విడ్డూరంగా ఉన్నది. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అధికారిక క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరిన వారి పోలీసులు దగ్గరుండి సాగనంపారు.
కేసీఆర్ మీద హత్యాయత్నానికి ప్లాన్ చేసిన రేవంత్ రెడ్డి
ఆ కోవలోనే కేసీఆర్ చావాలి, ఆయన చావు కోరుకుంటున్నాం అంటూ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాటలు
ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం మీద దాడికి బయలుదేరిన కాంగ్రెస్ గుంపు
బయలుదేరిన వారిలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
ఒకవైపు… https://t.co/C2FtPFKq3R pic.twitter.com/FwjysCoWpE
— Telugu Scribe (@TeluguScribe) September 8, 2026