KCR : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR )కు సిట్ అధికారులు మరోసారి నోటీసులు పంపారు. మున్సిపల్ ఎన్నికలు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నానని లేఖ రాయడంతో శుక్రవారం విచారణను వాయిదా వేసిన అధికారులు నందినగర్లోని నివాసంలో శుక్రవారం నోటీసులను అంటించి వెళ్లారు. ఫిబ్రవరి 1వ తేదీ(ఆదివారం) మధ్యాహ్నాం 3 గంటలకు విచారణ జరుపుతామని పేర్కొన్నారు.
ఇకపై ఏ నోటీసులైనా ఎర్రవల్లికే పంపాలని, 65 ఏళ్లు పైబడినందున సెక్షన్ 160 సీఆర్పీసీ ప్రకారం తాను పోలీస్ స్టేషన్కు రానని, ఉన్నచోటనే తనను విచారించాలని కేసీఆర్ చేసిన వినతిని అధికారులు తిరస్కరించారు. నందినగర్లోని నివాసంలో శుక్రవారం అధికారులు నోటీసులను అంటించి వెళ్లారు. ఫిబ్రవరి 1వ తేదీ(ఆదివారం) మధ్యాహ్నాం 3 గంటలకు విచారణ జరుపుతామని పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు మరోసారి 160 crpc సెక్షన్ కింద సాక్షిగా నోటీసులు ఇచ్చిన SIT అధికారులు
ఫిబ్రవరి 1వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు నంది నగర్ నివాసంలో విచారణ చేస్తామని నోటీసు pic.twitter.com/9R4u0DOsiY
— Telugu Scribe (@TeluguScribe) January 30, 2026
బీఆర్ఎస్ నాయకులను ఇబ్బందులకు గురి చేయాలనే ఉద్దేశంతోనే ఫోన్ ట్యాపింగ్ కేసును సాగదీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్పై రాజకీయంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. గురువారం సిట్ అధికారులు నందినగర్లోని నివాసంలో నోటీసులు అంటించి.. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు అందుబాటులో ఉండాలని కోరారు. అయితే.. మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు శుక్రవారమే ఆఖరు తేదీ కావడంతో.. అభ్యర్థులను ఖరారు చేయడంతో తాను బిజీగా ఉన్నానని విచారణను మరోరోజు జరపాల్సిందిగా కేసీఆర్ పోలీసులకు తెలిపారు. జూబ్లిహిల్స్ ఏసీపీ పి.వెంకటగిరికి శుక్రవారం తాను హాజరు కాలేకపోవడానికి గల కారణాలను వివరిస్తూ రెండు పేజీల లేఖ రాశారు గులాబీ బాస్.
సెక్షన్ 160 సీఆర్పీసీ ప్రకారం మరో రోజున తనను ఎర్రవల్లిలోని నివాసంలో విచారించాలి. అంతేకాదు ఈ సెక్షన్లోని నిబంధనల మేరకు నాకు మీరు ముందస్తు నోటీసులు పంపించి ఆ తర్వాతే విచారించాలి. మరో విషయం 65 ఏళ్లు పైబడిన పురుషులను వారు విచారణ కోసం పోలీస్ స్టేషన్ వెళ్లనవసరం లేదు. పోలీసులే వారి ఇంటివద్దకు వెళ్లి విచారణ
చేపట్టాలి. ఇకపై నాకు పంపాల్సిన నోటీసులను నేను నివసిస్తున్న ప్రాంతానికి అంటే.. ఎర్రవల్లికే పంపాలి. మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా, బాధ్యతగల పౌరుడిగా సిట్ విచారణకు పూర్తిగా సహకరిస్తాను అని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. ఆయన లేఖపై స్పందించిన సిట్ అధికారులు శుక్రవారం విచారణను వాయిదా వేశారు. మున్సిపల్ ఎన్నికలు ముగిశాక తనను విచారించాలని కేసీఆర్ కోరినప్పటికీ.. నందినగర్లోని నివాసంలో నోటీసులు అంటించి వెళ్లారు.