ముంబై: బాలీవుడ్ నటులు విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ జంటకు బెదిరింపులు వచ్చాయి. ఓ గుర్తు తెలియని వ్యక్తి సోషల్ మీడియా ద్వారా చంపేస్తానంటూ బెదిరించాడు. ఈ నేపథ్యంలో ముంబైలోని శాంటాక్రజ్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ కేసులో దర్యాప్తు కూడా ప్రారంభమైందన్నారు. ఇన్స్టాగ్రామ్లో ఆ నటులకు బెదిరింపులు వస్తున్నట్లు తేలింది. బెదిరింపునకు పాల్పడిన వ్యక్తి కత్రినా కైఫ్ను వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. ఐటీ చట్టం ప్రకారం కేసు బుక్ చేశారు.