రజనీకాంత్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన ‘చంద్రముఖి’ (2005) చిత్రం హారర్ కామెడీగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి రాఘవ లారెన్స్ హీరోగా సీక్వెల్ను తెరకెక్కిస్తున్నారు. పి.వాసు దర్శకుడు. తాజాగా ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్ తార కంగనారనౌత్ను ఎంపిక చేశారు. తొలిభాగంలో జ్యోతిక పాత్రకు కొనసాగింపుగా కంగనారనౌత్ కనిపించనుంది. నృత్యాల్లో చక్కటి ప్రవేశం ఉండటంతో ఆమెను ఈ సినిమాకు ఎంపిక చేశారని, రాజనర్తకిగా కంగనారనౌత్ పాత్ర చిత్రానికి ప్రధానాకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. ‘చంద్రముఖి’ సీక్వెల్లోనటిస్తున్నట్లు కంగనారనౌత్ సోషల్మీడియా ద్వారా వెల్లడించింది.