న్యూఢిల్లీ, నవంబర్ 21: పలు సందర్భాల్లో ప్రధాని మోదీకి, బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడే బాలీవుడ్ నటి కంగన రనౌత్ తాజాగా సిక్కు మతంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సిక్కులందరూ ఖలీస్థానీ ఉగ్రవాదులే అన్నట్టు ఆమె ఇన్స్టాగ్రామ్లో పెట్టిన స్టోరీ తీవ్ర వివాదాస్పదమైంది. ఖలీస్థానీ ఉగ్రవాదులు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతుండవచ్చు గానీ వారిని మాజీ ప్రధాని ఇందిరా గాంధీ దోమల్లాగా తన చెప్పుల కింద నలిపేశారని కంగన వ్యాఖ్యానించారు. ఢిల్లీ సిక్కు మేనేజ్మెంట్ కమిటీ, అకాలీదళ్ నేత మంజిదార్ సింగ్ ఫిర్యాదులపై ఢిల్లీ పోలీసులు కంగనపై కేసు నమోదు చేశారు.