Kangana Ranaut Emotional Post | బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రస్తుతం బాలీవుడ్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు మోస్ట్ వాంటెడ్ అయిపోయింది. కెరీర్ ప్రారంభంలో గ్లామర్ రోల్స్తో మెప్పించిన ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో మహిళా ప్రధాన చిత్రాలను ఎక్కువగా చేస్తుంది. అంతేకాకుండా మణికర్ణిక, తలైవీ వంటి సినిమాలు కంగానాకు మరింత క్రేజ్ను, మార్కెట్ను తెచ్చిపెట్టాయి. దాంతో లేడీ ఓరియెంటెడ్ కథల వైపు మొగ్గుచూపుతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎమర్జెన్సీ’. నాటి 1977 ఇండియన్ ఎమర్జెన్సీను బేస్ చేసుకుని ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఈ మూవీలో కంగనా, ఇందిరా గాంధీ పాత్ర పోషించింది. ఇప్పటికే మూవీ నుండి రిలీజైన కంగనా లుక్కు మంచి ప్రశంసలు వచ్చాయి. ఇక ఈ సినిమాకు దర్శకత్వం, నిర్మాణం బాధ్యతలు కూడా కంగనానే తీసుకుంది. కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. షూటింగ్ పూర్తయిన సందర్భంగా కంగనా సోషల్ మీడియాలో ఎమోషన్ నోట్ను అభిమానులతో పంచుకుంది. ఈ రోజు ఎమర్జెన్సీ షూట్ పూర్తి చేశాను. నా జీవితంలో అద్భుత ఘట్టం చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా కోసం నేను ఏ కష్టం పడలేదని అందరూ అనుకుంటున్నారు. కానీ వాస్తవం వేరు. నాకు సంబంధించిన ఆస్తులన్నీ ఈ సినిమా కోసం తాకట్టు పెట్టాను.
ఇక ఆరోగ్యం పరంగానూ ఈ సినిమా చేస్తూ చాలా ఇబ్బంది పడ్డాను. డెంగ్యూ బారిన పడి రక్త కణాల సంఖ్య భారీగా పడిపోయింది. అయినా తట్టుకుని నిలబడ్డాను. షూటింగ్కు హాజరయ్యాను. ఈ సమస్యను అధిగమించడం చాలా కష్టమైంది. ఇది నాకు పునర్జన్మ అంటూ ఎమోషనల్ నోట్ పోస్ట్ చేసింది. అనుపమ్ ఖేర్, శ్రేయాష్ తల్పడే, మహిమా చౌదరి కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది ప్రథమార్థంలో రిలీజ్ కానుంది.