అలహాబాద్ ,జూన్ 11 : అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ సంజయ్ యాదవ్ను అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. ఈ మేరకు న్యాయశాఖ నోటిఫికేషన్ను జారీ చేసింది. జస్టిస్ సంజయ్ యాదవ్ 1986 ఆగస్టు 25 న న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలు పెట్టారు. ఆయన జబల్పూర్లో 20 ఏండ్లపాటు సివిల్, రాజ్యాంగ, కార్మిక, ఉద్యోగ వ్యవహారాలలో న్యాయవాదిగా ప్రాక్టీసు చేసి, తన ప్రత్యేకత చాటుకున్నారు. ఆయన 1999 మార్చి నుంచి 2005 అక్టోబర్ వరకూ ప్రభుత్వ న్యాయవాదిగా పని చేశారు. అక్టోబర్ 2005 నుంచే ఆయన డిప్యూటీ అడ్వకేట్ జనరల్గా ఉన్నారు. ఆయన 2007,మార్చి2న మధ్య ప్రదేశ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తర్వాత 15 జనవరి 2010న శాశ్వత న్యాయమూర్తి గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఆయనను 2021 ఏప్రిల్ 14న అలహాబాద్ హైకోర్టుకు తాత్కాలిక న్యాయమూర్తిగా నియమించారు.