హైదరాబాద్ : బ్రహ్మోత్సవాల సందర్భంగా నగరంలో గల జూబ్లీహిల్స్లోని వేంకటేశ్వర స్వామి వారిని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి దర్శనం అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. వారి వెంట ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.