బాలాసోర్: ఒడిశాలో జర్నలిస్టుపై పోలీసులు దాడి చేశారు. ఆ తర్వాత ఆస్పత్రి పాలైన ఆ జర్నలిస్టును బెడ్కు ఇనుప చైన్తో కట్టేశారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి రిలీజైంది. బాలాసోర్లో జర్నలిస్టుగా ఉన్న లోక్నాథ్ దలేహ్ను హాస్పిటల్ బెడ్కు కట్టేసి ఉన్న ఫోటో ఇప్పుడు దుమారం రేపుతోంది. నీలగిరి పీఎస్ ప్రాంతంలో జరిగిన అవినీతి గురించి లోక్నాథ్ కథనాన్ని రాశారు.
ఈ నేపథ్యంలో అతనిపై పోలీసులు కక్ష కట్టినట్లు తెలుస్తోంది.ఈ ఘటనపై ఒడిశా డీజీపీ విచారణకు ఆదేశించారు. మొబైల్ తీసుకువెళ్లేందుకు పోలీసు స్టేషన్కు రమ్మని కోరారని, అక్కడికి వెళ్లిన తర్వాత ఇన్స్పెక్టర్ ద్రౌపదీ దాస్ తనపై దాడి చేశాడని, కిందపడిపోయిన తన కాళ్లకు బేడీలు వేసి హాస్పిటల్ బెడ్కు కట్టేశారని అన్నారు. ఒడిశా మానవ హక్కుల సంఘం ఈ ఘటనను సుమోటో కేసును స్వీకరించింది. 15 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని బాలాసోర్ ఐజికి ఆదేశించింది.