అమరావతి : ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ బాలశౌరి (YCP MP Balashauri) జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలో జనసేన కేంద్ర కార్యాలయంలో జనసేన అధినేత పవన్కల్యాణ్(Pawan Kalyan) సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు . బాలశౌరి మాట్లాడుతూ వైసీపీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) పై సెటైర్లు వేశారు. ‘సిద్ధం’ అంటూ మీటింగ్లు పెడుతున్న వైసీపీ దేనికి సిద్ధమని, పారిపోవడానికి సిద్ధమా అంటూ సెటైర్లు వేశారు.
రాబోయే రోజుల్లో జనసేన సైనికులు వేటాడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దేవుడున్నాడు అంటూ పదేపదే ఉపన్యాసాలు ఇచ్చే జగన్కే కాదు అందరికి దేవుళ్లు ఉన్నారని పేర్కొన్నారు. అమరావతి ( Amaravati )కట్టాలని వైఎస్ జగన్ పాదయాత్రలో చెప్పలేదా అంటూ ప్రశ్నించారు. జగన్ హయాంలో ఏపీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరుగ లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఎందుకు ముందుకు రావడం లేదని తెలిపారు. ఎప్పుడూ అబద్దాలు చెప్పలేదని జగన్ అబద్దం చెబుతున్నాడని విమర్శించారు.