ముంబై : జియో 5జీని దీపావళి నుంచి ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. అయితే 5జీలో లేటెస్ట్ వర్షన్.. స్టాన్డ్ఎలోన్ 5జీ టెక్నాలజీని వాడనున్నట్లు రిలయన్స్ జియో చైర్మెన్ ఆకాశ్ అంబానీ తెలిపారు. దీని కోసం జియో సుమారు రెండు లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నది. జియో 5జీ బ్రాడ్బ్యాండ్ని జియో ఎయిర్ ఫైబర్ పేరుతో పిలువనున్నారు. అల్ట్రా హై స్పీడ్ ఫిక్స్డ్ బ్రాడ్బ్యాండ్ సేవలు అందుబాటులో ఉంటాయని ఆకాశ్ వెల్లడించారు. ఫైబర్ లాంటి స్పీడ్తో ఎటువంటి వైర్లు లేకుండా డేటా అందుతుందని అన్నారు. అందుకే దాన్ని జియో ఎయిర్ ఫైబర్ అని పిలుస్తున్నట్లు చెప్పారు. దీన్ని ఇంట్లో లేదా ఆఫీసులో గిగాబైట్ స్పీడ్ ఇంటర్నెట్తో కనెక్ట్ చేసుకోవచ్చు. ఫిక్స్డ్ బ్రాడ్బ్యాండ్ అందుబాటులో ఉన్న దేశాల్లో ఇండియా టాప్ టెన్లో నిలువనున్నట్లు ఆయన చెప్పారు.