మాక్లూర్, ఏప్రిల్ 14: నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలోని మానిక్బండార్ గ్రామంలో గురువారం అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే జీవన్రెడ్డి గ్రామానికి చెందిన సఫాయి కార్మికురాలి కాళ్లను కడిగి కృతజ్ఞతలు తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం గ్రామానికి చెందిన సఫాయి కార్మికురాలు దుర్పతి కాళ్లను జీవన్రెడ్డి కడిగారు. దళితులంటే టీఆర్ఎస్ పార్టీకి ఎనలేని గౌరవమని, దళితబంధు పథకంతో వారి జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపుతున్నారని తెలిపారు. 30 ఏండ్లు సఫాయి కార్మికురాలిగా విధులు నిర్వహించిన దుర్పతికి ఈ రకంగా కృతజ్ఞతలు తెలిపినట్లు ఎమ్మెల్యే వివరించారు.