నల్లగొండ : జానారెడ్డి కొన్నేండ్లు మంత్రిగా పనిచేసినా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో చిన్న లీడరు స్థాయి అభివృద్ధి కూడా చేయలేదని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ విమర్శించారు.
నందికొండ హిల్కాలనీలోని వాసవీ కళాశాలలో గురువారం ముస్లిం మైనార్టీల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 20 సంవత్సరాలుగా అనేక పదవులను అనుభవించిన జానారెడ్డి నియోజకవర్గంలోని సమస్యలను ఏనాడూ పట్టించుకోలేదన్నారు. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య రెండేండ్లలోనే అనేక అభివృద్ధి పనులు చేపట్టారని తెలిపారు.
నందికొండను మున్సిపాలిటీగా చేసి అభివృద్ధి బాటపట్టించారని చెప్పారు. తెలంగాణ రాకముందు రాష్ట్రంలో 12 గురుకుల పాఠశాలలు ఉండగా నేడు 204 గురుకుల పాఠశాలలు, 18 కళాశాలను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారని, లక్షల మంది విద్యార్థులు నేడు అందులో చదువుతూ లబ్ధిపొందుతున్నారన్నారు.
షాదీముబారక్, కల్యాణ లక్ష్మిపథకం రాష్ట్రంలో 9 లక్షల మందికి ఉపయోగపడిందని తెలిపారు. ముస్లింల సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్, బీజేపీలకు ఓటు అడిగే హక్కు లేదన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నామని, టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
కార్యక్రమంలో నందికొండ ఎన్నికల ఇన్చార్జీలు కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్రావు, సుడా చైర్మన్ జీవి రామకృష్ణరావు, నందికొండ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మంద రఘువీర్, కౌన్సిలర్లు మంగ్తా, నిమ్మల ఇందిరాగౌడ్, రమేశ్జీ, నాయకులు నోముల లక్ష్మి, మోహన్నాయక్, ఆదాసు విక్రమ్ మైనార్టీ నాయకులు అబ్బాస్, బషీర్, సుభాని, హఫీజ్ అబ్దుల్ వహీద్, ఇక్బాల్, జహీరుద్దీన్, అహ్మద్అలీ, జబార్, మసిఉల్లాఖాన్, అర్షద్అలీ, నిరంజన్వలీ, ఫర్దీన్, ఖాజా, అన్నీస్, ఇంతీయాస్, ఓమార్, బాసిత్, అన్వర్, అలీమ్, సోహిల్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
అపర భగీరథుడు సీఎం కేసీఆర్ : మంత్రి సత్యవతి రాథోడ్
రైతులకు సాగునీటి సమస్యలు రానీయొద్దు
కారు కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య
పంచలోహ విగ్రహాల దొంగల అరెస్ట్