వాషింగ్టన్: హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమరూన్కు కోవిడ్ సోకింది. దీంతో ఆయన అవతార్-2 ఫిల్మ్ ప్రీమియర్కు దూరం కానున్నారు. కోవిడ్19 పరీక్షలో పాజిటివ్గా తేలిన జేమ్స్ కెమెరూన్.. లాస్ ఏంజిల్స్లో జరగనున్న అవతార్ ప్రీమియర్కు దూరంగా ఉండనున్నట్లు హాలీవుడ్ రిపోర్టర్ మ్యాగ్జిన్ పేర్కొన్నది. జేమ్స్కు కోవిడ్ పాజిటివ్ ఉన్నా.. ఆయన ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని, రొటీన్ టెస్టింగ్ చేస్తున్న సమయంలో జేమ్స్ పాజిటివ్గా తేలారని, వర్చువల్లో ఆయన షెడ్యూల్లో పాల్గొంటారని, ప్రీమియర్కు హాజరుకావడంలేదని డిస్నీ సంస్థ ప్రతినిధి తెలిపారు.
లాస్ ఏంజిల్స్ కౌంటీలోని నేచురల్ హిస్టరీ మ్యూజియంలో అవతార్: ద వే ఆఫ్ వాటర్స్ ఫిల్మ్ ప్రీమియర్ జరగనున్నది. దీట్లో జో సల్డానా, సామ్ వర్తింగ్టన్, సిగోర్నీ వీవర్, స్టీఫెన్ లాంగ్, క్లిఫ్ కర్టిస్, జోయల్ డేవిడ్ మూర్, ఎడి ఫాల్కో, జేమేన్ క్లిమెంట్, కేట్ విన్స్లెట్ నటిస్తున్నారు. ట్వెంటియత్ సెంచరీ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఇంగ్లీష్తో పాటు పలు భారతీయ భాషల్లో డిసెంబర్ 16వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. 250 మిలియన్ల డాలర్ల ఖర్చుతో ఈ సినిమా తీశారు.