న్యూఢిల్లీ, జనవరి 4: ఇరాన్లో బుధవారం జరిగిన జంట పేలుళ్లకు తమదే బాధ్యత అని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా (ఐసిస్) గురువారం ప్రకటించింది.
యూఎస్ డ్రోన్ దాడిలో 2020లో కన్నుమూసిన కమాండర్ ఖాసిం సులేమానీ 4వ వర్ధంతిని పురస్కరించుకుని కెర్మాన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జరిగిన రెండు పేలుళ్లలో 103 మంది మృతి చెందగా, 170 మంది గాయపడ్డారు. కాగా ఈ దాడి తామే చేసామంటూ ఇస్లామిక్ స్టేట్ తన అనుబంధ టెలిగ్రామ్ చానళ్లలో వెల్లడించింది.