న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇవాళ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు అంబరాన్ని అంటుతున్న విషయం తెలిసిందే. భూమికి 30 కిలోమీటర్ల ఎత్తులోనూ త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. 75వ స్వాతంత్య్రోత్సవం నేపథ్యంలో స్పేస్ కిడ్జ్ ఇండియా ఇవాళ భారత జాతీయ పతాకాన్ని ఆకాశంలో ఎగురవేసింది. సువిశాల ఆకాశంలో త్రివర్ణ పతాకం శోభాయామానంగా రెపరెపలాడింది. జాతీయ పతాకాన్ని ఆకాశంలో ఆవిష్కరించిన సంఘటనకు చెందిన వీడియోను స్పేస్ కిడ్జ్ తన ట్విట్టర్లో పోస్టు చేసింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా జాతీయ పతాకాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషజ్ఞం తెలిసిందే. ఇటీవల స్పేస్ కిడ్జ్ ఇండియా.. నింగిలోకి ఓ శాటిలైట్ను పంపింది. 750 మంది స్కూల్ గర్ల్స్ ఆజాదీశాట్ ఉపగ్రహాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రయోగం విఫలమైంది.
Celebrating 75 Years of Independence by unfurling the Indian Flag @ 30 km in Near Space.@PMOIndia @narendramodi @DrJitendraSingh@isro @INSPACeIND@mygovindia#AzadiKaAmritMahotsov#HarGharTiranga pic.twitter.com/4ZIJMdSZE6
— Space Kidz India (@SpaceKidzIndia) August 14, 2022