న్యూఢిల్లీ : భారత్ తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన విమాన వాహక నౌక విక్రాంత్ ట్రయల్స్ కొచ్చి తీరంలో ఆదివారం నిర్వహించారు. 40వేల టన్నుల విమాన వాహక నౌక ఆగస్ట్లో తొలిసారిగా ఐదు రోజుల పాటు తొలిసారి సముద్ర యాత్రను విజయవంతంగా పూర్తి చేసింది. ఇండిజెనస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ (IAC) నిర్మాణం అతిపెద్దది.. అత్యంత క్లిష్టమైంది. భారత్ ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియాలో కీలకం కానుంది.
ఫిబ్రవరి 2009లో నిర్మాణం ప్రారంభం కాగా.. ఈ నౌకను కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ నిర్మించింది. బేసిన్ ట్రయల్స్ నవంబర్ 2020లో పూర్తయ్యాయి. ప్రాజెక్ట్ ఖర్చు దాదాపు రూ.23వేల కోట్లు అంచనా వేశారు. ఈ యుద్ధనౌక మిగ్-29కే యుద్ధ విమానాలు, కమోవ్-31 హెలికాప్టర్లు, ఎంహెచ్-60ఆర్ మల్టీ రోల్ హెలికాప్టర్లను మోసుకెళ్లగలదు. యుద్ధ నౌకలో 2,300 కంపార్ట్మెంట్లు ఉండగా.. మహిళా అధికారులకు ప్రత్యేకంగా, సిబ్బంది కోసం మొత్తం 1,700 క్యాబిన్లు ఉన్నాయి. వచ్చే ఏడాది విక్రాంత్ విధుల్లో చేరే అవకాశం ఉన్నది.