పనాజీ: భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ తృణమూల్ కాంగ్రెస్లో చేరాడు. శుక్రవారం పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో పేస్ తృణమూల్ తీర్థం పుచ్చుకున్నాడు. 1996 అట్లాంటా ఒలింపిక్స్లో కాంస్య పతకం నెగ్గిన పేస్.. ప్రజా సేవ కోసమే రాజకీయ మార్గాన్ని ఎంచుకున్నట్లు పేర్కొన్నాడు.