క్వీన్స్టౌన్: వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడుతున్న భారత మహిళల జట్టు..రెండో పోరుకు సిద్ధమైంది. శనివారం జరిగిన తొలి పోరులో పరాజయం పాలైన మిథాలీరాజ్ బృందం.. మంగళవారం మ్యాచ్లో సత్తాచాటి సిరీస్ సమం చేయాలని చూస్తున్నది. మొదటి వన్డేలో కెప్టెన్ మిథాలీ మినహా తక్కిన వాళ్లంతా విఫలం కాగా.. బౌలర్లు కూడా పెద్దగా ఆకట్టుకోలేపోయారు. ఈ నేపథ్యంలో లోపాలను సవరించుకొని సమిష్టిగా సత్తాచాటేందుకు టీమ్ఇండియా సిద్ధమవుతున్నది. క్వారంటైన్ నిబంధనల కారణంగా గత మ్యాచ్లో ఆడని స్టార్ ఓపెనర్ స్మృతి మందన మంగళవారం పోరుకు కూడా అందుబాటులో లేకపోవడంతో.. మిథాలీ బృందానికి ఇబ్బందులు పెరుగనున్నాయి. వన్డే అరంగేట్రంలోనే ఓపెనర్గా బరిలోకి దిగి పెద్దగా ఆకట్టుకోలేకపోయిన తెలుగమ్మాయి సబ్బినేని మేఘనకు జట్టులో చోటు దక్కుతుందా చూడాలి.