సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ హఠాన్మరణం పట్ల నా తీవ్ర సంతాపం తెలియజేస్తున్నా. హెలికాప్టర్ ప్రమాదంలో రావత్తోపాటు ఆయన సతీమణి, పలువురు ఆర్మీ జవాన్లు దుర్మరణం పాలవడం నన్ను తీవ్రంగా కలచివేసింది. దేశ రక్షణ రంగానికి బిపిన్ రావత్ చేసిన సేవలు మరువలేనివి. చిరస్మరణీయమైనవి. రావత్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. -సీఎం కేసీఆర్
దేశభద్రతకు, భారత సైన్యానికి అసమాన సేవలందించిన జనరల్ రావత్ దుర్మరణం పాలుకావడం దురదృష్టం. -గవర్నర్ తమిళిసై
సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి, ఇతర సైనిక సిబ్బంది మరణించడం దిగ్భ్రాంతికి గురిచేసింది.-మంత్రి కేటీఆర్
మంత్రులు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, నిరంజన్రెడ్డి, మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్రావు, పువ్వాడ అజయ్, ఇంద్రకరణ్రెడ్డి, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, సబితా ఇంద్రారెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి, గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వేర్వేరు ప్రకటనల్లో సంతాపం ప్రకటించారు.
నాలుగు దశాబ్దాలపాటు మాతృభూమికి నిస్వార్థంగా సేవలందించిన జనరల్ రావత్ తన శౌర్యంతో, వీరత్వంతో గుర్తింపు పొందారు.-రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
జనరల్ రావత్, ఆయన సతీమణి, ఇతర ఆర్మీ అధికారుల మరణం నన్ను నిశ్చేష్టుడిని చేసింది.-ఉపరాష్ట్రపతి, వెంకయ్యనాయుడు
ఆర్మీ సిబ్బంది అంకితభావంతో దేశానికి సేవలందించారు. మరణించిన ఆర్మీ సిబ్బంది కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. రావత్ సేవలను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. -ప్రధాని మోదీ