టోక్యో : ఒలింపిక్స్ సెమీస్లో భారత్ – బెల్జియం జట్ల మధ్య మ్యాచ్ హోరాహోరీగా సాగుతున్నది. రెండోక్వార్టర్ ముగిసే సమయానికి ఇరుజట్లు చెరో రెండు గోల్స్ సాధించాయి. మ్యాచ్ తొలి క్వార్టర్లోనే భారత ఆటగాళ్లు రెండు గోల్స్ సాధించారు. ఏడో నిమిషంలో హర్మన్ప్రీత్ సింగ్ తొలి గోల్ సాధించాడు. ఎనిమిదో నిమిషంలో మన్దీప్ సింగ్ రెండో గోల్ చేశాడు. తొలి క్వార్టర్ రెండో నిమిషంలో బెల్జియం తొలి గోల్ను సాధించింది. రెండో క్వార్టర్ తొలి నిమిషంలో బెల్జియం ఆటగాళ్లు రెండో గోల్ సాధించారు. ఈ మ్యాచ్లో భారత జట్టుపై భారీ అంచనాలున్నాయి. బెల్జియంపై భారత్ జట్టు విజయం సాధిస్తే చరిత్ర సృష్టించనుంది. 41 సంవత్సరాల తర్వాత హాకీలో పతకం అందుకోనుంది. 1980లో చివరిసారి హాకీ టీం బంగారు పతకం అందుకుంది. మరో వైపు అథ్లెటిక్స్ జావెలిన్ త్రో మహిళల విభాగం క్వాలిఫికేషన్ గ్రూప్-ఏలో అన్నురాణి నిరాశ పరిచింది. 14వ స్థానంలో నిలిచి ఫైనల్స్కు అర్హత సాధించలేకపోయింది.