బ్లూమ్ఫాంటైన్: భారత్ ‘ఎ’- దక్షిణాఫ్రికా ‘ఎ’ మధ్య జరిగిన తొలి అనధికారిక టెస్టు ‘డ్రా’గా ముగిసింది. నాలుగో రోజు శుక్రవారం వర్షం రావడంతో మ్యాచ్ రద్దయ్యింది. 4 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసి మెరుగైన స్థితిలో ఉన్న భారత్ ఆఖరి రోజు వరుణుడి కారణంగా బరిలోకి దిగకుండానే మ్యాచ్ ముగిసింది. చేతిలో ఆరు వికెట్లు ఉన్నా భారత్ ఇంకా 201 పరుగులు వెనుకబడి ఉంది.
టీమ్ఇండియా తరఫున బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ (103) అజేయ సెంచరీతో అదరగొట్టాడు. అంతకుముందు దక్షిణాఫ్రికా-‘ఎ’ 509/7 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా రెండో మ్యాచ్ ఈనెల 29న ప్రారంభం కానుంది. అయితే కరోనా వైరస్ కొత్త వేరియంట్ విజృంభణతో మ్యాచ్ జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దక్షిణాఫ్రికా ‘ఎ’: 135.3 ఓవర్లకు 509/7 డిక్లేర్డ్ (పీటర్ మలన్ 163, టోనీ జార్జి 117; సైనీ 2/67, అర్జాన్ 2/75)
భారత్ ‘ఎ’: 93.1 ఓవర్లకు 308/4. (అభిమన్యు 103, ప్రియాంక్ 96, పృథ్వీ షా 48).