IND vs WI, 2nd Test Day 2 | వెస్టిండీస్తో రెండో టెస్టు మ్యాచ్లో రెండో రోజు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (206 బంతుల్లో 121; 11 ఫోర్లు) సెంచరీతో కదంతొక్కడంతో టీమ్ఇండియా భారీ స్కోరు చేసింది. ఫలితంగా భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 438 పరుగులకు ఆలౌటైంది. స్పిన్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా (152 బంతుల్లో 61; 5 ఫోర్లు), రవిచంద్రన్ అశ్విన్ (78 బంతుల్లో 56; 8 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్లో బరిలోకి దిగిన వెస్టిండీస్ను రవీంద్ర జడేజా ఆరంభంలోనే దెబ్బతీశాడు. ఓపెనర్ చందర్పాల్ (33)ను అవుట్ చేశాడు. జడ్డూ బౌలింగ్లో అశ్విన్కు క్యాచ్ ఇచ్చిన చందర్పాల్ పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 1 వికెట్ నష్టానికి విండీస్ 86 పరుగులు చేసింది. విండీస్ ఇంకా 352 పరుగులు వెనుకబడి ఉంది.
ఓవర్నైట్ స్కోరు 288/4తో రెండో రోజు గురువారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్.. ఆడుతూ పాడుతూ ముందుకు సాగింది. 87 పరుగుల వ్యక్తిగత స్కోరుతో క్రీజులో అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ.. సెంచరీతో (121) కదంతొక్కడంతో టీమ్ఇండియా భారీ స్కోరు చేసింది. అంతర్జాతీయ స్థాయిలో కోహ్లీకి ఇది 500వ మ్యాచ్ కాగా.. 500వ ఇంటర్నేషనల్ మ్యాచ్లో సెంచరీ చేసిన తొలి క్రికెటర్గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఇక మూడు ఫార్మాట్లలో కలిపి కోహ్లీకి ఇది 76వ సెంచరీ కాగా.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వంద శతకాలతో అగ్రస్థానంలో ఉన్నాడు. విదేశీ గడ్డపై 2018 తర్వాత కోహ్లీకి ఇదే తొలి టెస్టు సెంచరీ కావడం గమనార్హం.
West Indies fight back after Virat Kohli brought up his century early on Day 2.
📝 #WIvIND: https://t.co/4hUd6BPlKw#WTC25 pic.twitter.com/YSVsxIT6iX
— ICC (@ICC) July 21, 2023