IND vs SL : కొండంత లక్ష్య ఛేదనలో శ్రీలంక మరింత కష్టాల్లో పడింది. పేసర్ సిరాజ్ విజృంభించి మూడో వికెట్ పడగొట్టాడు. అతను వేసిన 8వ ఓవర్ మూడో బంతికి నవనిదు ఫెర్నాండో (19) బౌల్డ్ అయ్యాడు. కుశాల్ మెండిస్ (4), ఓపెనర్ ఆవిష్క ఫెర్నాండో (1)లను పెవిలియన్కు పంపిన అతను మూడో వికెట్ తీసి లంకను దెబ్బకొట్టాడు. అంతకుముందు సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ భారత్కు మూడో వికెట్ అందించాడు. అని బౌలింగ్లో చరిత అసలంక (1) ఇచ్చిన క్యాచ్ను అక్షర్ పటేల్ పైకి ఎగిరి అందుకున్నాడు. కెప్టెన్ దసున్ శనక 4, వనిందు హసరంగ 1 రన్స్తో క్రీజులో ఉన్నారు. 8 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక నాలుగు వికెట్ల నష్టానికి 37 రన్స్ చేసింది.