బలహీనత అనుకున్న మిడిలార్డర్ అద్భుతంగా రాణించడంతో ఆసీస్తో జరిగిన తొలి టీ20లో భారత జట్టు భారీ స్కోరు చేసింది. ఓపెనర్ రాహుల్ (55), సూర్యకుమార్ (46), హార్దిక్ పాండ్యా (71 నాటౌట్) సత్తాచాటారు. దీంతో ఆసీస్ ముందు టీమిండియా.. 209 పరుగుల భారీ టార్గెట్ నిలిపింది. అయితే బౌలర్లు తేలిపోవడంతో ఈ భారీ లక్ష్యాన్ని కంగారూలు ఛేజ్ చేసేశారు.
ఛేజింగ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఆసీస్కు ఆరోన్ ఫించ్ (22), కామెరూన్ గ్రీన్ (61) అద్భుతమైన ఆరంభం అందించారు. ఆ తర్వాత వచ్చిన స్టీవ్ స్మిత్ (35) కూడా రాణించాడు. ఇలాంటి తరుణంలో ఉమేష్ యాదవ్ ఒకే ఓవర్లో స్మిత్, మ్యాక్స్వెల్ (1)ను పెవిలియన్ చేర్చి భారత అభిమానుల్లో ఆశలు రేపాడు. ఆ మరుసటి ఓవర్లోనే అక్షర్ పటేల్ బౌలింగ్లో ఇంగ్లీస్ (17) అవుటయ్యాడు.
అయితే చివర్లో వచ్చిన టిమ్ డేవిడ్ (18), మాథ్యూ వేడ్ (45 నాటౌట్) భారీ షాట్లతో విరుచుకుపడి విజయాన్ని భారత్కు దూరం చేశారు. అయితే అనూహ్యంగా చివరి ఓవర్ వేసిన చాహల్.. తొలి బంతికే టిమ్ డేవిడ్ను పెవిలియన్ చేర్చాడు. ఆ మరుసటి బంతికే బౌండరీ బాదిన కమిన్స్ (4 నాటౌట్) ఆసీస్ను విజయతీరాలకు చేర్చాడు. దీంతో ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 211 పరుగులు చేసి నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 3, ఉమేష్ యాదవ్ 2, చాహల్ ఒక వికెట్ తీసుకున్నారు. భారత బౌలర్లలో అక్షర్ ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేయగా.. మిగతా వాళ్లు వికెట్లు తీయకపోవడం అటుంచితే కనీసం పరుగులు కట్టడి కూడా చెయ్యలేకపోయారు. దీంతో మూడు మ్యాచుల టీ20 సిరీసులో ఆసీస్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.
Run Galore at Mohali #INDvAUS pic.twitter.com/dBy0tlQFTQ
— Cricket97 (@cricket97bd) September 20, 2022