అయిజ: కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద పెరిగింది. దీంతో 10 గేట్లు ఎత్తి దిగువకు 15,370 క్యూసెక్కుల వరద నీరు విడుదల చేస్తున్నారు. సోమవారం డ్యాంలోకి ఇన్ఫ్లో 27,507 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 23,645 క్యూసె క్కులు ఉంది.
100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 100.855 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 1633 అడుగుల నీటి మట్టానికి గాను, ప్రస్తుతం 1633.00 అడుగులు ఉన్నట్లు టీబీ బోర్డు కార్యదర్శి నాగమోహన్, సెక్షన్ అధికారి విశ్వనాథ్లు తెలిపారు.
ఆర్డీఎస్ ఆనకట్టకు ..
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద నిలకడగా కొనసాగుతోంది. సోమవారం ఆనకట్టకు 9,310 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉండగా, 8,900 క్యూసెక్కుల వరద నీరు ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి వరద చేరుతోందని కర్ణా టక ఆర్డీఎస్ ఏఈ డేవిడ్ తెలిపారు. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆన కట్టలో 9 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు ఆయన పేర్కొ న్నారు. ఆర్డీఎస్ ప్రధానకాల్వకు 410 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు.