రమణ్, ప్రియాంక రౌరీ, పావని, అంకిత, వర్ష ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’. సిరి మూవీస్ పతాకంపై కె. శిరీషా రమణారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం రమేష్, గోపి దర్శకత్వం వహించారు. వినోద్ కుమార్ మరో కీలక పాత్రలో నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 8న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. అనంతరం సినిమా మంచి విజయం సాధించాలని కోరుతూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రమిదని, హీరో శ్రీకాంత్ ట్రైలర్ విడుదల చేసి సపోర్ట్ చేయడం ఆనందంగా ఉందన్నారు చిత్ర దర్శకులు రమేష్, గోపి. రచ్చ రవి, మిర్చి మాధవి, జూనియర్ బాలకృష్ణ, శంకర్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : కేఏ ఆనంద్, సంగీతం : మహిత్ నారాయణ్.