అగ్ర తార రష్మిక మందన్న జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు. ‘పుష్ప’తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న ఈ భామ…భారీ ఆఫర్లను ఖాతాలో వేసుకుంటున్నది. తాజాగా ఆమె ఓ క్రేజీ చిత్రంలో నాయికగా ఎంపికైనట్లు తెలుస్తున్నది. దర్శకుడు వంశీ పైడిపల్లి తమిళ హీరో విజయ్తో రూపొందిస్తున్న సినిమాలో హీరోయిన్గా రష్మికను తీసుకోనున్నట్లు సమాచారం. నాయిక కోసం ముందుగా పూజా హెగ్డే, కియారా అద్వానీ వంటి వారిని అనుకున్నా..ఆ అవకాశం రష్మికనే వరించింది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. విజయ్ నటిస్తున్న 66వ చిత్రమిది. పాండమిక్ వల్ల ఆలస్యమైన ఈ సినిమా ఉగాది రోజున సెట్స్ మీదకు వెళ్లనుందట. ఇక బాలీవుడ్లోనూ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది రష్మిక మందన్న. ఆమె నటించిన తొలి హిందీ చిత్రం ‘మిషన్ మంజు’ విడుదల తేదీ ఖరారు చేసుకుంది. జూన్ 10న ఈ సినిమా తెరపైకి వస్తున్నది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించిన ఈ సినిమా భారత గూఢచారి సాహసాలను చూపించనుంది.