హైదరాబాద్, నవంబర్ 22(నమస్తే తెలంగాణ): ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్(ఐజీబీసీ) ఆధ్వర్యంలో చేపట్టిన ‘పర్ఫార్మెన్స్ ఛాలెంజ్ ఫర్ గ్రీన్ బెల్ట్ ఎన్విరాన్మెంట్’ కార్యక్రమంలో ఎంపికైన పలు సంస్థలకు ఐజీబీసీ లీడర్షిప్ అవార్డులు ప్రకటించింది. పర్యావరణానికి హాని చేకూరని విధంగా గ్రీన్ బిల్డింగ్ ప్రాజక్టు నిబంధనలను పాటించినందుకుగాను ఈ సంస్థలను సత్కరించినట్లు సీఐఐ-ఐజీబీసీ ఒక ప్రకటనలో తెలిపింది. 30-40 శాతం నీటి ఆదాతోపాటు 25-35 శాతం విద్యుత్ను ఆదా చేసినందుకుగాను ఈ భవనాలను గ్రీన్ బిల్డింగ్లుగా గుర్తించినట్లు వారు తెలిపారు. ఇన్ఫోసిస్, ఎస్టీటీ జీడీసీ, నెట్మ్యాజిక్ సొల్యూషన్స్, జహోరన్స్కీ అండ్ మెషిన్స్, మహీంద్రా టెక్నికల్ అకాడమీ, వైభవ్ గ్లోబల్ లిమిటెడ్, అపోలో హాస్పిటల్స్, గ్రేటర్ నోయిడా మెడికల్ వర్శిటీ, ఇండియన్ రైల్వేస్, ఐటీసీ, క్యాప్జెమినీ, జెమినీ గ్రూప్ సర్వీసెస్, ట్రాన్సిట్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, షపత్ వీ, ఎల్బీఆర్డీ వేర్హౌస్ తదితర సంస్థలు అవార్డులకు ఎంపికయ్యాయి. వర్చువల్ పద్ధతిలో జరిగిన ఈ అవార్డుల కార్యక్రమానికి కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ డీజీ అభయ్ బక్రే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐజీబీసీ, కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఎకడమిక్స్, కెపాసిటీ బిల్డింగ్, పాలసీ ఎడ్వకసీ, రీసర్చ్ తదితర అంశాల్లో సహకారానికి అవగాహనా ఒప్పందం చేసుకున్నాయి.