హైదరాబాద్: రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించే ఐసెట్ ఫైనల్ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభమయింది. తుదివిడత కౌన్సెలింగ్ షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. కొత్తగా కౌన్సెలింగ్లో పాల్గొనేవారు స్లాట్ బుక్చేసుకోవాలని ఐసెట్ కన్వీనర్ నవీన్ మిట్టల్ వెల్లడించారు. ఆదివారం నుంచి ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్బుకింగ్, ఈ నెల 22న సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని తెలిపారు. ఈ నెల 22, 23 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని, 26న సీట్లు కేటాయిస్తామన్నారు.