ICC : మహిళల టీ20 జట్టును ఐసీసీ సోమవారం ప్రకటించింది. 2022 సంత్సరానికి గానూ 11 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. భారత జట్టు నుంచి ఏకంగా నలుగురు క్రికెటర్లు ఈ లిస్టులో చోటు దక్కించుకున్నారు. స్మృతి మంధాన, రీచా ఘోష్, దీప్తి శర్మ, రేణుకా సింగ్ ఠాకూర్లు ఐసీసీ టీ20 జట్టుకు ఎంపికయ్యారు. ఆస్ట్రేలియా నుంచి తహ్లియా మెక్గ్రాత్, అష్ గార్డ్నర్, బేథ్ మూనేలు సెలక్ట్ అయ్యారు. నిడా దార్ (పాకిస్థాన్), సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్), ఇనోక రణవీర (శ్రీలంక) కూడా ఈ జట్టులో చోటు సంపాదించారు. ఈ టీమ్కు న్యూజిలాండ్ ప్లేయర్ సోఫీ డెవినేను కెప్టెన్గా, రీచా ఘోష్ను వికెట్ కీపర్గా ఐసీసీ ఎంపిక చేసింది.
జట్టు ఇదే.. సోఫీ డెవినే (కెప్టెన్), స్మృతి మంధానా, బెథె మూనే, అష్ గార్డ్నర్, తహ్లియా మెక్గ్రాత్, నిడా దార్, రీచా ఘోష్ (వికెట్ కీపర్), సోఫీ ఎక్లెస్టోన్, ఇనోక రణవీర, రేణుకా సింగ్.
🇮🇳 x 4
🇦🇺 x 3
🇳🇿 🇵🇰 🏴 🇱🇰 x 1Unveiling the ICC Women’s T20I Team of the Year 2022 🤩 #ICCAwards
— ICC (@ICC) January 23, 2023