న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ ఇండియా భవిష్యత్ తరం మల్టీ పర్పస్ వెహికల్ (ఎంవీపీ).. స్టారియా.. టీజర్ దృశ్యాలను ఆవిష్కరించింది. ఆల్ న్యూ మల్టీ పర్పస్ వెహికిల్గా భారత్లోనూ, అంతర్జాతీయంగానూ హ్యుండాయ్కు గల పేరును పునరుద్ధరిస్తుందని భావిస్తున్నారు. స్టారియా చూడటానికి వ్యాన్లా కనిపిస్తున్నా.. దీన్ని కారు డిజైన్లో నూతన రూపంగా భావిస్తున్నారు.
దీని డిజైన్పై హ్యుండాయ్ స్పందిస్తూ.. ‘స్టారియా డిజైన్ స్ట్రైకింగ్లీ ఫ్యూచరిస్టిక్, మిస్టరియస్గా స్పేస్షిప్లా’ కనిపిస్తుందని పేర్కొంది. వ్యాన్లా కనిపిస్తున్న న్యూ డిజైన్ కారు భవిష్యత్లో 100 ఏండ్లు మనుగడ కొనసాగిస్తుందని తెలిపింది. అయితే, సదరు స్టారియా ఎలక్ట్రికల్ వెహికల్గా ఉంటుందా? హైబ్రీడ్ వెహికల్గా ఉంటుందా? అన్న సంగతి మాత్రం హ్యుండాయ్ బహిర్గతం చేయలేదు. భారత్లో హ్యుండాయ్ తయారు చేయనున్న తొలి ఎంవీపీగా ఇది నిలువనున్నది.