సిటీబ్యూరో, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ ) : హైదరాబాద్ మహా నగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న కృష్ణా ఫేజ్-1 జలాల తరలింపులో అంతరాయం ఏర్పడింది. జలమండలి సంతోష్నగర్ వద్ద జంక్షన్ పనులు చేపడుతుంది. సంతోష్నగర్ జంక్షన్ వద్ద నల్గొండ – ఓవైసీ హాస్పిటల్ ఫె్లైఓవర్ డౌన్ ర్యాంప్ పిల్లర్ల అలైన్మెంట్ కృష్ణా ఫేజ్ -1కు సంబంధించిన 450 ఎంఎం, 600 ఎంఎం డయా పైపులైన్లు ఉన్నాయి. అక్కడ ఫె్లైఓవర్ నిర్మాణానికి ఆటంకాలు తొలగించేందుకు అక్కడున్న పైపు లైన్లను పకకు జరిపేందుకు జంక్షన్లో పనులు చేపట్టాలని జలమండలి నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఉదయం 6 నుంచి మరుసటి రోజు గురువారం ఉదయం 6 గంటల వరకు మొత్తం 24 గంటల పాటు ఈ పనులు కొనసాగనున్నాయి. ఈ 24 గంటల పాటు నీటి సరఫరా నిలిచిపోనుంది. దీంతో బుధవారం పలు ప్రాంతాలకు నీటి సరఫరా ఉండదని, గురువారం కూడా నీటి సరఫరాలో స్వల్ప అంతరాయం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
మిరాలం, కిషన్బాగ్, అల్ జుబైల్ కాలనీ రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాలు, సంతోష్ నగర్, వినయ్నగర్, సైదాబాద్, చంచల్గూడ, అస్మాన్గఢ్, యాకుత్పురా, మాదన్నపేట, మహబూబ్ మాన్షన్ రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాలు, రియాసత్నగర్, అలియాబాద్ రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాలు, బొగ్గులకుంట, అఫ్జల్గంజ్ రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాలు, నారాయణగూడ, అడిక్మెట్, శివం, నల్లకుంట , చిలకలగూడ, దిల్సుఖ్నగర్ రిజర్వాయర్, బొంగుళూరు, మన్నెగూడ రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని అధికారులు పేర్కొన్నారు. ఈ స్వల్ప అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకొని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకొని, అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.