బాంబోలిమ్: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్(హెచ్ఎఫ్సీ) కొత్త చరిత్ర లిఖించింది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ ఐఎస్ఎల్లో హైదరాబాద్ తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన రెండో సెమీస్లో ఏటీకే 1-0 తేడాతో హెచ్ఎఫ్సీపై విజయం సాధించింది. రాయ్కృష్ణ(79ని) మోహన్బగాన్కు ఏకైక గోల్ అందించాడు. అయితే అంతకుముందు జరిగిన మొదటి సెమీస్లో హెచ్ఎఫ్సీ 3-1తో గెలువడంతో..గోల్స్ తేడా పరంగా ఓవరాల్గా 3-2తో హెచ్ఎఫ్సీ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. లీగ్ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన హెచ్ఎఫ్సీ స్థాయికి తగ్గ ప్రదర్శనతో అదరగొట్టింది. లీగ్ దశ నుంచే ప్రతీ మ్యాచ్ను కీలకంగా భావిస్తూ పాయింట్లు కొల్లగొట్టింది. సెమీస్లో మోహన్బగాన్ రూపంలో కఠిన ప్రత్యర్థి ఎదురైనా వెరవకుండా ముందుకు సాగి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. ఈనెల 20న జరిగే ప్రతిష్ఠాత్మక టైటిల్ పోరులో కేరళ బ్లాస్టర్స్తో హైదరాబాద్ తలపడుతుంది.