నెలల తరబడి కమ్మేసిన మంచుపొరలు తొలగిపోయి.. ఇప్పుడిప్పుడే వెచ్చదనం నేలంతా పరుచుకుంటున్నది. వసంతం దగ్గరవుతున్నకొద్దీ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. చర్మ సంరక్షణకు చర్యలు తీసుకోవాల్సిందే. లేకపోతే ఒళ్లంతా పొడిబారిపోతుంది. మొహం కళా విహీనంగా మారుతుంది.
చర్మం పొడిగా ఉంటే, సాధారణ సబ్బులకు కొన్నాళ్లు దూరంగా ఉండటం మంచిది. బదులుగా ఉదయం, రాత్రిళ్లు క్లెన్సర్ ఉపయోగించవచ్చు.
ఓ టీ స్పూన్ పాలకు కొన్ని చుక్కల తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల
నిగారింపు వస్తుంది.
ముఖం జిడ్డుగా అనిపిస్తే, 50 మి.లీ రోజ్వాటర్లో ఒక టీ స్పూన్ స్వచ్ఛమైన గ్లిజరిన్ కలపాలి. ఆ మిశ్రమాన్ని ఓ సీసాలో వేసి బాగా కదిలించి, ముఖానికి పట్టించాలి. ఈ ప్యాక్ చర్మానికి తగినంత తేమను అందిస్తుంది.
వసంతకాలంలో చర్మంపై తరచుగా దద్దుర్లు వస్తుంటాయి. గంధపు చెక్కను మెత్తగా నూరుకుని, ముద్దచేసి చర్మంపై పూయడం వల్ల మెరుగైన ఫలితం ఉంటుంది.