INDW vs HKGW : ఆసియా కప్లో శుభారంభం చేసిన భారత మహిళల జట్టు రెండో మ్యాచ్ ఆడుతోంది. హాంకాంగ్ చైనాను ఢీకొంటున్న టీమిండియా.. ఈ మ్యాచ్ గెలిస్తే సెమీఫైనల్ దూసుకెళ్లడం ఖాయం. దాంతో.. మామూలుగా కాకుండా భారీ తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేయాలని హర్మన్ప్రీత్ సేన భావిస్తోంది. అయితే.. టాస్ టాస్ గెలుపొందిన హాంకాంగ్ చైనా జట్టు కెప్టెన్ నటాషా మైల్స్ భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది.
తొలి విజయంతో సెమీస్కు చేరువైన భారత మహిళల జట్టు ఈసారి హాంకాంగ్ చైనాతో తలపడుతోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన హాకాంగ్ కెప్టెన్ నటాషా మైల్స్ బౌలింగ్ తీసుకుంది. థాయ్లాండ్ను బౌలర్ల మాదిరిగానే టీమిండియాను కట్టడి చేయాలని తాము భావిస్తున్నట్టు మైల్స్ చెప్పింది. తుది జట్టు విషయానికొస్తే హర్మన్ప్రీత్ బృందం ఏ మార్పులు లేకుండా ఆడుతోంది. కానీ, హాంకాంగ్ చైనా మాత్రం రెండు మార్పులు చేసింది.
A look at our Playing XI for today’s game against Hong Kong.
Live – https://t.co/5owq9vvH2Z #INDvHK pic.twitter.com/WmSo5sYavc
— BCCI Women (@BCCIWomen) September 3, 2026
భారత తుది జట్టు : స్మృతి మంధాన, షఫాలీ వర్మ, ప్రతీకా రావల్, హర్మన్ప్రీత్ కౌర్(కెప్టెన్), భారతి ఫుల్మాలి, రీచా ఘోష్(వికెట్ కీపర్), ప్రేమా రావత్, నందిని శర్మ, శ్రీ చరణి, క్రాంతి గౌడ్.
హాంకాంగ్ చైనా తుది జట్టు : నటాషా మైల్స్(కెప్టెన్), మరియం బిబి, మరికో హిల్, జాయ్లీన్ కౌర్, మరీనా లాంప్లో, యాస్మినే దస్వానీ(వికెట్ కీపర్), షంజీన్ షహజాద్, కారీ చాన్, రుచితా వెంకటేశ్, ఇక్రా సహర్, అలిసన్ సియూ.