ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలనే కోరికతో పోలీసు ఉద్యోగం చేయాలనుకున్నా..ఆర్థిక పరిస్థితులు అనుకూలించలేదు.. దీంతో ఊరిలో బర్లను కాస్తూ.. బట్టలు కుట్టే పని చేశాడు.. అయితే.. పోలీస్ ఉద్యోగంపై ఉన్న ప్రేమతో 2000లో హోంగార్డుగా విధుల్లో చేరాడు. ఇలా.. 21 ఏండ్లపాటు హోంగార్డుగా పనిచేసిన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పెండ్యాల గ్రామానికి చెందిన ఈశ్వరయ్య.. విధులను నిబద్ధతో, నిజాయితీగా పనిచేసి ఉన్నతాధికారుల మన్ననలను పొందాడు.
ఎక్కడ విధులు నిర్వహించినా పేదవారు, ఆకలితో అలమటించే వారు ఎవరైనా సరే.. వారికి భోజనం, అల్ఫాహారం, ఇతర తినుబండరాలను అందించి ఆదుకున్నాడు. అలాగే చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించినవారిని కాపాడారు.. ఇలా అతని సేవలు గుర్తించిన పోలీసులు ఉన్నతాధికారులు అతనికి ప్రధానమంత్రి లైఫ్ సేవింగ్ అవార్డు కోసం సిఫార్సు చేశారు.