హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): గడ్డి అన్నారం మారెట్ను మరోచోటకు బదిలీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్ధించింది. బహుళ ప్రజావసరాల కోసం మారెట్ను తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఆమోదిస్తున్నట్లు తెలిపింది. నగరాభివృద్ధి అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో గడ్డి అన్నారం మారెట్ స్థలంలో ప్రభుత్వం ప్రజల కోసం ఆస్పత్రి నిర్మించడాన్ని స్వాగతించింది. అంతిమంగా ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్యానించింది. మారెట్ స్థలాన్ని మరింత బాగా ప్రజలకు ఉపయోగపడేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్లు వెల్లడించింది.
అంతే కాకుండా రోజు వారీ అభివృద్ధి పనులను కోర్టులు సమీక్ష చేయజాలవని స్పష్టం చేసింది. విచక్షణాధికారంతో అభివృద్ధి పనుల్లో ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. గడ్డి అన్నారం మారెట్ స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగిస్తూ మారెట్ కమిటీ చేసిన తీర్మానాన్ని తప్పుపట్టలేమని వెల్లడించింది. గడ్డి అన్నారం మారెట్ స్థలంలో ప్రభుత్వం ఆస్పత్రి నిర్మించడాన్ని అందరూ స్వాగతించాలని, కరోనా వ్యాప్తి సమయంలో ఆస్పత్రుల ద్వారా తగిన వైద్య సదుపాయాలు లేక రోగులు పడిన అవస్థలను విస్మరించకూడదని వ్యాఖ్యానించింది.
ఎంతో మంది అమాయకులు చనిపోయారని, నేటికీ కొవిడ్ భయం వెన్నంటే ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో మారెట్ ప్రాంతంలో ఆస్పత్రి నిర్మాణం చేయడం వల్ల బహుళ ప్రజా ప్రయోజనాలు ఉంటాయని చెప్పింది. అందుకే, ప్రభుత్వం గడ్డి అన్నారం మారెట్ తరలింపునకు తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోవడం లేదని, వ్యాపారులు దాఖలు చేసిన అప్పీళ్ల పిటిషన్లపై విచారణ ముగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదే సమయంలో గడ్డి అన్నారంలో వ్యాపారం చేసే వారంతా మూడు నెలల్లోగా బాట సింగారం మారెట్కు వెళ్లేందుకు గడువు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేరొంది. సోమవారం నుంచి వ్యాపారులు తమ వ్యాపారాలను గడ్డిఅన్నారం లేదా బాట సింగారం మారెట్లలో నిర్వహించుకోవచ్చునని స్పష్టం చేసింది. బాట సింగారంలో సౌకర్యాల కల్పన ఏర్పాట్లు చేస్తామన్న హామీ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంది. గడ్డి అన్నారం నుంచి బాట సింగారానికి మారెట్ తరలింపు చర్యను సవాల్ చేసిన కేసులో ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ సింగిల్ జడ్జి వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ వ్యాపారులు దాఖలు చేసిన అప్పీళ్ల వ్యాజ్యాలపై విచారణను ముగిస్తున్నట్లు ప్రకటించింది.
కోర్టు కమిషనర్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వేర్వేరుగా ఇచ్చిన నివేదికల ప్రకారం బాట సింగారంలో పూర్తి స్థాయిలో వసతుల కల్పన జరగలేదని, అందుకే గడువు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ‘ప్రభుత్వం హామీ మేరకు కోహెడలోని 178 ఎకరాల్లో శాశ్వత ప్రాతిపదికపై వసతులు కల్పించాలి. పనులు సత్వరమే చేయాలి. వైద్యం, మరుగుదొడ్లు, తాగునీరు, క్యాంటీన్ వంటి వసతులు పూర్తి స్థాయిలో కల్పించాలి. కోర్టు ఉత్తర్వులను అమలు చేయని అధికారుల తీరు సరికాదు. కనీసం కౌంటర్ పిటిషన్ కూడా దాఖలు చేయని మారెట్ కమిటీ చైర్మన్ ముత్యంరెడ్డి, కార్యదర్శి పి.హర్షలకు రూ.2 వేలు చొప్పున జరిమానా విధిస్తున్నాం. అప్పీల్ పిటిషన్ల విచారణకు ముగిం పు చెబుతున్నాం’అని ఉత్తర్వుల్లో పేరొంది.