న్యూఢిల్లీ: కరణ్ మల్హోత్రా డైరెక్ట్ చేసిన శంషీరా ఫిల్మ్కు చెందిన టీజర్ను ఇవాళ రిలీజ్ చేశారు. ఈ ఫిల్మ్లో రణ్బీర్ కపూర్, సంజయ్ దత్, వాణీ కపూర్ నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకు చెందిన ట్రైలర్ను శుక్రవారం రిలీజ్ చేయనున్నారు. తమ తెగ ప్రజలను కాపాడుకునేందుకు రణ్బీర్ విరోచిత పోరాటం చేస్తాడు. ప్రతినాయకుడి పాత్రలో సంజయ్ దత్ నటించారు. ఇద్దరి మధ్య ఉత్కంఠభరితమైన సీన్స్ ఉండనున్నాయి. ఫిల్మ్ ట్రైలర్ను హిందీ, తెలుగు భాషల్లో రిలీజ్ చేయనున్నారు. సంజయ్ దత్, వాణీకపూర్లు తమ సోషల్ మీడియా అకౌంట్లలో ఈ ఫిల్మ్ టీజర్ను పోస్టు చేశారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను జూలై 22వ తేదీన రిలీజ్ చేయనున్నారు.