న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు దంచికొడుతున్నాయి. ఆదివారం పలు ప్రాంతాల్లో అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. సుమారు ఆరు ప్రాంతాల్లో 45 డిగ్రీల సెల్సియస్ మార్క్ను దాటింది. సఫ్దార్జంగ్ అబ్జర్వేటరీ ఉన్న ప్రాంతంలో అత్యధికంగా 44.2 డిగ్రీల సెల్సియస్ నమోదు అయ్యింది. ఆ ప్రాంతంలోనే శనివారం 43.9, శుక్రవారం 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపారు. ఇక ముంగేశ్వర్ ప్రాంతంలో అత్యధికంగా 47.3 డిగ్రీలు నమోదు అయ్యింది. ఢిల్లీలో ఇదే హాటెస్ట్ ప్రాంతంగా నిలిచింది. స్పోర్ట్స్ కాంప్లెక్స్, పీతాంపుర, నజఫ్ఘర్, జాఫర్పుర్, రిడ్జ్ ప్రదేశాల్లో 46.6, 46.2, 46.3, 45.1, 45.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. సోమవారం కూడా ఎండలు తీవ్రంగా ఉంటాయని, కొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.