రిగా(లాత్వియా): ఫిడే గ్రాండ్ స్విస్ మహిళల చెస్ టోర్నీలో భారత గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక ఖాతాలో మరో డ్రాచేరింది. సోమవారం జరిగిన ఆరో రౌండ్ పోరులో హారిక..జార్జియాకు చెందిన బతిశవిలీ నినోతో జరిగిన గేమ్ను డ్రా చేసుకుంది. దీంతో ప్రస్తుతం నాలుగు పాయింట్లతో హారిక ఆరో స్థానంలో కొనసాగుతున్నది. వంతికా అగర్వాల్ 0-1తో అలెగ్జాండ్రా (రష్యా) చేతిలో ఓటమిపాలైంది.