Gun Fire | నగర శివారులో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. మేడ్చల్ జిల్లా పోచారం పరిధిలో ఒక వ్యక్తిపై గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపి పరారయ్యాడు. ఈ ఘటనలో సోను సింగ్ అలియాస్ అనే వ్యక్తి గాయపడ్డాడు. స్థానికులు అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అతడు గోరక్షక్గా సమాచారం. ఇబ్రహీం అనే వ్యక్తితో ప్రశాంత్ సింగ్కు వాగ్వాదం జరగ్గా.. తీవ్రస్థాయికి చేరడంతో ఇబ్రహీం వెంట తెచ్చుకున్న షార్ట్ గన్తో సోనుసింగ్పై కాల్పులు జరిపినట్లు సమాచారం. వెంటనే చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇబ్రహీం కాల్పులు జరుపడంతో సోనుసింగ్ పక్కటెముకల్లోకి నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది. కాల్పులు జరిపిన అనంతరం ఇబ్రహీం పరారీలో ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.