దివ్యాంగుల సంక్షేమ దినంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, నాయకులు
మేడ్చల్, డిసెంబర్ 3 : మేడ్చల్ నియోజకవర్గంలో దివ్యాంగుల సంక్షేమ దినాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మేడ్చల్ పట్టణంలోని భవిత కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో దివ్యాగుంలకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీపీ పద్మాజగన్రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగులకు చేయూతనందిస్తే ఎందులోను తీసిపోరని, వారిలో ఉన్న ఆత్మైస్థెర్యం చాలా గొప్పదన్నారు. మనలో ఒకరిగా వారిని గుర్తించి ఆదరించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈవో వసంత, ప్రధానోపాధ్యాయులు శ్రీధర్, రాజిరెడ్డి, భవిత కేంద్రం ఇన్చార్జి యమున పాల్గొన్నారు.
పీర్జాదిగూడ కార్పొరేషన్లో ..
పీర్జాదిగూడ పరిధి..బాలాజీనగర్ కాలనీలో శుక్రవారం అభయశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వృత్తి నైపుణ్య కేంద్రాన్ని మేయర్ జక్క వెంకట్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శివకుమార్గౌడ్, కమిషనర్ రామకృష్ణారావు, పౌండేషన్ గౌరవ అధ్యక్షుడు చంద్రారెడ్డి, అధ్యక్షుడు వెంకటేశ్, నాయకులు అంజిరెడ్డి పాల్లొన్నారు.
జవహర్నగర్లో..
దివ్యాంగుల సంక్షేమ దినం సందర్భంగా కార్పొరేషన్లో నిర్వహించిన కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్గుప్తా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం వంద మంది దివ్యాంగులకు దుస్తులు, బియ్యం పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు శ్రీనివాస్రెడ్డి, రాంచందర్, లావణ్యసతీశ్గౌడ్, సుబ్రహ్మణ్యం, నాయకులు, దివ్యాంగుల సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మోనార్ దుర్గాప్రసాద్, వీరారెడ్డి పాల్గొన్నారు. జవహర్నగర్ ప్రాథమిక పాఠశాలలో ఎంఈవో శశిధర్ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినం నిర్వహించారు.
ఘట్కేసర్ మండలంలో..
మండలంలోని ఎదులాబాద్లో నిర్వహించిన దివ్యాంగుల సంక్షేమ దినంలో ఎంపీపీ ఏనుగు సుదర్శన్రెడ్డి, డీఆర్డీవో పద్మజ పాల్గొన్నారు. వైఎస్రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సురేశ్, ఎంపీటీసీ రవి, కో ఆప్షన్ సభ్యుడు ఇక్బాల్, ఏపీడీ యాదయ్య, ఏపీఎం తౌర్య నాయక్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ప్రవీణ్రెడ్డి పాల్గొన్నారు.