కడ్తాల్ : గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మంగళవారం ఆమనగల్లు పట్టణంలో అధికారులు వివిధ స్థలాలను పరిశీలించారు. పట్టణంలోని ఆమనగల్లు-మాడ్గుల్ ప్రధాన రహదారిలో, విఠాయిపల్లి-చెన్నారం రహదారిలో స్థలాన్ని అధికారులు పరిశీలించారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆమనగల్లు మున్సిపల్లో క్రీడా మైదానం ఏర్పాటుకు స్థలాలను పరిశీలిస్తున్నామని తహసీల్దార్ పాండునాయక్, మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్ తెలిపారు. స్థలాన్ని ఎంపిక చేసి మైదానం ఏర్పాటుకు పనులు ప్రారంభిస్తున్నామని వారు పేర్కొన్నారు.
మైదానానికి స్థల పరిశీలన
శంకర్పల్లి : గ్రామాల్లో క్రీడా మైదానాలను ఏర్పాటు చేయడానికి మంగళవారం తహసీల్దార్ సైదులు ఆధ్వర్యంలో వివిధ స్థలాలను అధికారులు పరిశీలించారు. మోకిల, పిల్లిగుండ్ల, శేరిగూడ, దోంతాన్పల్లి, మోకిల తాండ, కొండకల్, మిర్జాగూడ, మహరాజ్పేట్ గ్రామాల్లో క్రీడా స్థలాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకయ్య, ఆర్ఐ విక్రమ్రెడ్డి, మోకిల సర్పంచ్ సుమిత్ర, దొంతాన్పల్లి సర్పంచ్ అశ్విని, పిల్లిగుండ్ల సర్పంచ్ సత్యనారాయణరెడ్డి, మిర్జాగూడ సర్పంచ్ రవీందర్గౌడ్, శేరిగూడ ఉప సర్పంచ్ ఇంద్రారెడ్డి, కార్యదర్శులు పాల్గొన్నారు.
సర్వే చేసి గ్రామస్తులకు అప్పగింత
చేవెళ్లరూరల్ : గ్రామాల్లో క్రీడా స్థలాల ఏర్పాటు కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని చేవెళ్ల తహసీల్దార్ అశోక్, ఎంపీడీవో రాజ్కుమార్ అన్నారు. మండల పరిధిలోని మీర్జాగూడ, కౌకుంట్ల, గుండాల, పామెన, బస్తేపూర్, ఖానాపూర్, నాన్చెరు, హస్తేపూర్, తంగడిపల్లి, తలారం, రామన్నగూడ తదితర గ్రామాల్లో క్రీడా స్థలం కోసం సర్వే చేసి గ్రామస్తులకు అప్పగించామన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ రాజేశ్, సర్వేయర్ రవీందర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రతి గ్రామానికి మైదానం
మొయినాబాద్ : గ్రామీణ యువకుల్లో క్రీడా చైతన్యం నింపడానికే ప్రతి గ్రామానికి ఒక క్రీడా మైదానం ఏర్పాటు చేయడం ప్రభుత్వ లక్ష్యం అని ఎంపీడీవో సంధ్య అన్నారు. మంగళవారం సురంగల్ గ్రామంలో ప్రభుత్వ భూమిని క్రీడా మైదానం కోసం అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువత కూడాక్రీడా రంగంలో రాణించాలనే గొప్ప ఆలోచనతో క్రీడా మైదానాలను ఏర్పాటు చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ లావణ్య, పంచాయతీ కార్యదర్వి యాదగిరి, ఉపాధి హామీ పథకం అధికారి సుధాకర్, వార్డు సభ్యులు విక్రంరెడ్డి, నాయకులు సీతారాంరెడ్డి, మహేశ్రెడ్డి పాల్గొన్నారు. అదే విధంగా మండల పరిధిలోని ముర్తుజాగూడ గ్రామంలో కూడా క్రీడా మైదానాన్ని అధికారులు పరిశీలించారు. ఎంపీడీవోతో పాటు పంచాయతీ కార్యదర్శి లావణ్య, నాయకులు పెంటారెడ్డి పాల్గొన్నారు.