న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ఎన్నికల్లో జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఉపాధ్యక్ష పదవికి పోటీపడుతున్నాడు. ఆఖరి రోజైన శుక్రవారం గోపీచంద్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశాడు. తొలుత ప్రధాన కార్యదర్శి పదవికి పోటీచేయాలనుకున్న గోపీచంద్..సుదీర్ఘ మంతనాల తర్వాత ఉపాధ్యక్ష పదవి రేసులో నిలిచాడు. గోపి తప్పుకోవడంతో జూనియర్ టీమ్కోచ్ సంజయ్ మిశ్రాకు ప్రధాన కార్యదర్శి పదవికి మార్గం సుగమమైంది. దీంతో 12 మంది ఉపాధ్యక్షుల్లో గోపీ ఒకడిగా నిలువనున్నాడు. ఈనెల 19 నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి తేదీ కాగా, 20న తుది జాబితాను విడుదల చేయనున్నారు.